ఈ నెల 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పునస్కరించుకుని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో హోతి (కె) బాలికల రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శ్రీ సూరి కృష్ణ గారు నిర్వహించి విద్యార్థులకు మహిళల భద్రత, మహిళల హక్కులు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలు పురుషులకు ధీటుగా అన్నిరంగాల్లో రాణించాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఎంతయినా ఉన్నదని తెలియజేసారు. విద్యార్ధినిలు చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత లక్షాలను అధిరోహించాలని, ఆర్థికంగా నిలబడాలని సూచించారు. కార్యక్రమంలో పోక్సో చట్టం, సమాచార హక్కు చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, జువైనైల్ జస్టిస్ యాక్ట్, ఉచిత న్యాయసేవా సహాయంపై విద్యార్థులకు తెలియజేసారు. బాల్య వివాహా బాధితులు, బాల కార్మికులు ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే పాఠశాల ప్రధానోపాధ్యాయులకు గాని, స్థానిక తహసీల్దార్ లేదా స్థానిక పోలీస్ అధికారికి లేదా మండల లీగల్ సర్వీసెస్ కార్యాలయంలో గాని లేదా 1098 కి ఫోన్ ద్వారా తెలుపవచ్చని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యాంగా ఉంచబడతాయని తెలియజేసారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ మానెన్న గారు, సీనియర్ న్యాయవాదులు పాండురంగా రెడ్డి గారు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, కళాశాల ప్రధానోపాధ్యాయులు విజయ గారు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments